కర్నూలు జిల్లా నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే ఇజయ్య దంపతులు, కుమారుడు రాజశేఖర్పై కర్నూలు దిశ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
భర్త, అత్తమామలు వేధిస్తున్నారంటూ ఇజయ్య కోడలు ఝాన్సీ రాణి అలియాస్ సమీరా రాణి ఫిర్యాదు చేసింది.
అనుమానంతో హింసించారని, అదనపు కట్నం కోసం వేధించారని ఝాన్సీ రాణి ఆరోపిస్తోంది. గర్భవతి అని చూడకుండా శారీరకంగా హింసించారని పేర్కొంది.
తనకు న్యాయం చేయాలంటూ కలెక్టరేట్ ముందు బాధితురాలు నిరసన తెలిపింది.