అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని సాధు కామాక్షమ్మ ఆలయంలో బుధవారం విజయదశమిని పురస్కరించుకొని అమ్మవారిని దర్శించుకునేందుకు విచ్చేసిన శాసనసభ్యులు మేడ మల్లికార్జున రెడ్డి పర్యటన వివాదం తలెత్తింది.జడ్పీ చైర్మన్ అకేపాటి అమర నాధ రెడ్డి,మున్సిపల్ అధ్యక్షులు పోలా శ్రీనివాసుల రెడ్డి లతో కలిసి పూజ,సన్మానం తదితర కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ప్రస్తుత పాలకవర్గ ప్రతినిధులు నిర్వహించాలి కాని అందుకు విరుద్ధంగా మాజీపాలక వర్గం నిర్వహించడంతో వివాదం నెలకొంది. ప్రస్తుత ,మాజీ పాలక ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగింది.కొంత సేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది.ఆయనతో పాటూ జడ్పీ చైర్మన్ అమర నాధ రెడ్డి,మునిసిపల్ చైర్మన్ పొలా శ్రీనివాసులు రెడ్డి కూడా పాల్గొన్నా వారికి పేరు ప్రస్తావన లేకుండా అభ్యంతరం తెలుపక పోవడం విశేషం.