సేవా భారతి స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ములుగు జిల్లా కేంద్రంలోని గ్రామ పంచాయతి కార్యాలయ సిబ్బందికి, పారిశుధ్య కార్మికులకు రోగ నిరోధక ఆయుర్వేద కషాయాన్ని పంపిణీ చేశారు.
కోవిడ్ వైరస్ ఉధృతంగా వ్యాపిస్తున్న సందర్భంలో పరిసరాలను పరిశుభ్రం చేయడంలో నిరంతరం కృషి చేస్తున్న పారిశుధ్య కార్మికులు అనారోగ్యానికి గురికాకుండా ఉండేందుకు కషాయాన్ని వితరణ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సేవా ప్రముఖ్ కార్యకర్తలు చల్లగురుగుల మల్లయ్య, చుంచు రమేష్,రంజిత్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.