సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండలానికి చెందిన కళ్యాణలక్ష్మీ , షాదీముబారక్ లబ్దిదారులకు శనివారం నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి చేతుల మీదుగా మండల రెవిన్యూ కార్యాలయంలో 14 మంది లబ్ది దారులకు 12,26,612 రూపాయల చెక్కులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ జగన్ నాయక్, ఎంపీపీ ముడావత్ పార్వతి కొండా నాయక్, మండల పార్టీ అధ్యక్షుడు మన్నెం శ్రీనివాస రెడ్డి, MRO జయశ్రీ, మండల సర్పంచ్ లు, ఎంపీటీసీ లు తదితరులు పాల్గొన్నారు.