కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో సవార్గావ్, మహమద్బాద్ గ్రామాల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను జూకల్ శాసనసభ్యులు హన్మంత్ షిండే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి వరం లాంటిది అన్నారు.
కార్యక్రమంలో ఇరు గ్రామాల సర్పంచులు పవర్ కిషన్, లక్షెట్టి సాయిలు, జుక్కల్ సీనియర్ నాయకులు నీళ్లు పటేల్, బొల్లి గంగాధర్, జాగృతి నాయకురాలు అనిత సింగ్, లబ్ధిదారులు భారతీయ రాష్ట్ర సమితి శ్రేణులు ఉన్నారు.
జి.. లాలయ్య సత్యం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం