అంబర్ పేట నియోజక వర్గ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అంబర్ పేట తహసిల్దార్ మండల కార్యాలయంలో 74 మందికి కల్యాణ లక్ష్మి చెక్కులను స్థానిక అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్, ఎంఆర్ఓ లలిత, బాగ్ అంబర్ పేట కార్పొరేటర్ పద్మా వెంకట్ రెడ్డితో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రం లో లేని విధంగా పేద బడుగు బలహీన వర్గాల వారి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం మన కెసిఆర్ అని తెలిపారు. పేదింటి ఆడబిడ్డకు మేనమామ లాగా కల్యాణలక్ష్మి పథకం కింద 1లక్ష 1116 రూపాయలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ మహేష్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రామారావు యాదవ్, జాకీ బాబు, మహేష్ ముదిరాజ్, వంజరి నాగరాజు, సంతోష్ చారి, తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట