రామంతాపూర్ డివిజన్లో సుకన్య సమృద్ధి యోజన పాస్ బుక్కులను శుక్రవారం రామంతపూర్ డివిజన్ కార్పొరేటర్ బండారు శ్రీ వాణి,పోస్టల్ సూపరిండెంట్ శర్మ తో కలిసి అర్హులైన లబ్ధిదారులకు సుకన్య సమృద్ధి యోజన పాసుబుక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఈ స్కీమ్ ఆడబిడ్డ పుట్టినప్పటి నుంచి 10 సం,, వరకు అర్హులు. నెలకు వెయ్యి చొప్పున 15 సం.లు కడితే 21 సం,, వచ్చే సరికి 5లక్షలు రూపాయలు వస్తాయని గత వారం రామంతాపూర్ లో ప్రారంభించి 20 మందికి లబ్ది చేకూర్చామని అన్నారు.
ఈ అవకాశాన్ని డివిజన్లోని ప్రతి ఇంటిలోని ఆడపిల్లలు అందరు వినియోగించుకోవాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో అంబర్పేట పోస్ట్ ఆఫీస్ మేనేజర్ సుభాష్నాయక్, పుష్పరాజ్ సింగ్, శ్రీమణి, జనార్ధన్, రామకృష్ణ ,సురేష్, రవి, సత్తయ్య, సుమలత తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి