పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎస్ఈసీ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. స్థానిక ఎన్నికల విధుల నుంచి తొమ్మిది మంది అధికారులను తప్పిస్తూ ఆయన ఉత్తర్వులు జారీ చేశారు.
వీరిలో ఇద్దరు కలెక్టర్లు, ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, నలుగురు సీఐలు ఉన్నారు. ఈమేరకు తప్పించిన అధికారుల వివరాలను సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్కు ఎస్ఈసీ లేఖ ద్వారా పంపించారు.
ఎన్నికల సంఘం తప్పించిన అధికారులలో గుంటూరు జిల్లా కలెక్టర్, చిత్తూరు జిల్లా కలెక్టర్, తిరుపతి అర్బన్ ఎస్ పి, పలమనేరు డిఎస్ పి, కాళహస్తి డిఎస్ పి, మాచర్ల సిఐ, పుంగనూరు సిఐ, రాయదుర్గం సిఐ, తాడిపత్రి సిఐ ఉన్నారు.