కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం అన్ని జిల్లాల్లో వేగవంతంగా మొదలైంది.
తొలి దశలో హెల్త్ శాఖ సిబ్బంది వేసుకోగా…రెండో దశలో రెవిన్యూ శాఖ సిబ్బంది కరోనా వ్యాక్సిన్ వేసుకున్నారు.
నిన్న కాక మొన్ననే తెల్లవారు జామున 5 గంటలకే విజయనగరం జిల్లా కలెక్టర్ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు.
తాజాగా..కలెక్టరేట్ హాలులో జాయంట్ కెలెక్టర్ మహేష్ కుమార్, జిల్లా రెవిన్యూ అదికారి గణపతి రావులు ముందుగా కరోనా వ్యాక్సిన్ వేసుకున్నారు.
అనంతరం..తమ తమ, సిబ్బంది కి వాక్సినేషన్ వేసుకోవాలని ఇద్దరు జిల్లా అధికారులు ఆదేశించారు.
అలాగే జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.ఎస్.వి. రమణ కుమారి నేతృత్వంలో వైద్య సిబ్బంది కరోనా వ్యాక్సిన్ వేసుకున్నారు.