34.2 C
Hyderabad
April 19, 2024 19: 00 PM
Slider విజయనగరం

విజయనగరం లో గార్మెంట్ షోరూం ను ప్రారంభించిన వీఎంసీ డిప్యూటీ మేయర్

#DeputyMayor

మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా ఎదగాలని విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి అన్నారు. నగరంలోని రింగ్ రో డ్డు పువ్వాడ స్కూల్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన భారతి బోటిక్యు గార్మెంట్ షోరూము ను డిప్యూటీ మేయర్ ప్రారంభించారు. అనంతరం డిప్యూటీ మేయర్. మాట్లాడుతూ మహిళల మనోభావాలకు అనుగుణంగా సరికొత్త డిజైన్లతో, నాణ్యమైన వస్త్రాలను, అందుబాటు ధరలో మహిళలకు అందించాలన్నారు.

మహిళల ఆర్థిక అభివృద్ధికి సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. మహిళలకు రుణమాఫీ కింద వైయస్సార్ ఆసరా పేరిట నాలుగు విడతల్లో నిధులు విడుదల చేసి మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు సీఎం జగన్ కృషి ఎంతైనా అభినందనీయమన్నారు. మహిళలు వ్యాపారవేత్తలుగా కూడా రాణించాలని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముంతంజలో ఉండాలన్నారు. జగన్ ప్రభుత్వం మహిళలను ప్రోత్సహించేందుకు వివిధ పథకాలను అమలు చేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు ఆమె అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో నగరానికి చెందిన వస్త్రాభిమానులు, ఖాతాదారులు విచ్చేసి నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు

Related posts

తెలంగాణ ప్రజా సేన, నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ రవీందర్ కి సన్మానం

Satyam NEWS

ధర్మవరం ఎమ్మెల్యే స్టాఫ్ లో 8 మందికి కరోనా

Satyam NEWS

దరఖాస్తు చేసుకున్న 10 రోజుల్లోనే వ్యవసాయ రుణాలు

Satyam NEWS

Leave a Comment