ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ లో ని డాక్టర్ ఏఎస్ రావు నగర్ డివిజన్ వార్డ్ కార్యాలయంలో సోమవారం వివిధ శాఖల అధికారులతో కలిసి డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. డివిజన్ పరిధిలో నెలకొన్న వివిధ సమస్యలు, జరగాల్సిన అభివృద్ధి పనుల గురించి డివిజన్ పరిధిలోని అన్ని కాలనీలు, అపార్ట్మెంట్ల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో ఈ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా వివిధ కాలనీల ప్రతినిధులు ముఖ్యంగా తాము ఎదుర్కొంటున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య, లో ప్రెజర్ నీటి సరఫరా, వీధి దీపాలు మెయింటెనెన్స్, దోమల సమస్య, లో ఓల్టేజ్ సమస్య, పార్కుల అభివృద్ధి, ఇటీవల కురిసిన వర్షాలకు శిధిలమైన రోడ్ల వాటి మరమ్మతులు తదితర పనులు పూర్తి చేయాలని కార్పొరేటర్ కు వినతి పత్రాలు లు అందజేశారు. ముఖ్యంగా జై జవాన్ కాలనీ కి ఆనుకొని స్మశాన వాటిక అభివృద్ధి, పరిరక్షణకు చర్యలు చేపట్టాలని కాలనీవాసులు వినతి పత్రం ద్వారా కోరారు.
దశలవారీగా సమస్యలు పరిష్కరిస్తాం
ఈ సందర్భంగా కార్పొరేటర్ శిరీష సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ డివిజన్ పరిధిలో నెలకొన్న ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి దశలవారీగా అన్ని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఇప్పటికే కొన్ని అభివృద్ధి పనులు మంజూరయ్యాయి సాంకేతిక కారణాల వల్ల పనులు ప్రారంభమయ్యే ఎందుకు జాప్యం జరుగుతోందన్నారు. త్వరలో అన్ని సమస్యలను పరిష్కరించేందుకు అధికారులతో కలిసి ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గ బి బ్లాక్ కాప్రా సర్కిల్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, భవాని నగర్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కొత్త అంజి రెడ్డి, పెద్ది నాగరాజు గుప్తా, సీనియర్ నాయకులు ఎస్ ఏ రహీం, జిహెచ్ఎంసి కాప్రా అధికారులు డి ఈ బాలకృష్ణన్, ఏఈ సంతోష్ రెడ్డి, ఏఈ ట్రాన్స్పోర్ట్ గంగా ప్రసాద్, డీఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ చందన, ఏఈ వాటర్ వర్క్స్ స్రవంతి, ఏఈ ఎలక్ట్రికల్ ప్రత్యూష, ఏఈ టి ఎస్ పి డి సి ఎల్ మోహన్ రెడ్డి, శానిటరీ సూపర్వైజర్ నాగరాజు, జవాన్లు వర్క్ ఇన్స్పెక్టర్లు ఎస్ ఎఫ్ ఎలు, కాలనీల ప్రతినిధులు నవీన్ గౌడ్ శ్రీనివాస్ సుదర్శన్ రెడ్డి, జగన్ అల్లూరయ్య, తిరుమలయ్య, నాగు తదితరులు పాల్గొన్నారు.