39.2 C
Hyderabad
March 29, 2024 16: 52 PM
Slider కృష్ణ

మళ్లీ రాష్ట్రంలో వేర్పాటువాదం అంటే తోలు తీస్తా

#pavankalyan

ఆంధ్రప్రదేశ్‌ ను మరోసారి విడగొడతామంటే తోలుతీసి విరగ్గొడతానని జనసేన అధినేత పవన్‌కల్యాణ్  హెచ్చరించారు. మంగళగిరిలో జరిగిన జనసేన కార్యకర్తల సమావేశంలో జనసేనాని పాల్గొని జగన్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. ‘‘వేర్పాటు వాద ధోరణితో ఎవరైనా మాట్లాడితే నాలాంటి తీవ్రవాదిని ఇంకొకరిని చూడరు. ఎవరికీ సమాధానం చెప్పక్కర్లేదని వైసీపీ నేతలు అనుకుంటున్నారు. వాళ్ల మెడలు వంచి జవాబు చెప్పిస్తాం. ఏమయ్యా ధర్మాన.. నీకు మంత్రి ఇవ్వకపోతే ప్రత్యేక రాష్ట్రం కావాలా? ధర్మాన.. బైరెడ్డి ప్రత్యేక రాష్ట్రాలు అంటే సరిపోతుందా? రాయలసీమ అనే వాళ్లు ఎందుకు అక్కడ అభివృద్ధి చేయలేదు. ముఖ్యమంత్రులందరూ రాయలసీమ నుంచి వచ్చే కదా పాలించారు? ప్రధానిని కలిస్తే ఈసారి సజ్జల, వైసీపీ నేతలపై ఫిర్యాదు చేస్తా. మంత్రి ఇల్లు తగులపెట్టించుకున్నా సీఎం వెళ్లలేదు. ఎందుకంటే వాళ్లు కావాలనే నిప్పు పెట్టించుకున్నారు. అందుకే ముఖ్యమంత్రి వెళ్లలేదు. బాబాయిని చంపేసి కేసును సీబీఐకు ఇవ్వమనడం ఏమిటి?.’’ అని పవన్ ప్రశ్నించారు.

Related posts

తాడ్వాయి రేంజ్ ఆఫీస్ లో వన్యప్రాణి వారోత్సవాలు

Satyam NEWS

ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఘనంగా సుదర్శన హోమం

Satyam NEWS

Over-The-Counter Lower Blood Pressure Medication Quick Way To Lower Blood Pressure At Home

Bhavani

Leave a Comment