గజ్వేల్లో దారుణ హత్యకు గురైన యువతి దివ్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్న వేములవాడకు చెందిన వెంకటేష్తో దివ్యకు మూడేళ్ల క్రితమే ప్రేమ వివాహం జరిగింది. ఇద్దరి కులాలు వేరు కావడంతో వెంకటేష్ తల్లిదండ్రులు ఈ పెళ్లిని అంగీకరించక లేదు.
దాంతో వారిద్దరూ వేరైపోయారు. పెళ్లి సమయంలో దివ్య మేజర్ కాకపోవడంతో ఆమెను తల్లిదండ్రులు హాస్టల్లో ఉంచి చదించారు. ఈ నేపథ్యంలో పలుమార్లు దివ్యను వెంకటేష్ వేధించాడని, చివరకు ఈ వ్యవహారం పంచాయితీ వరకూ వెళ్లిందని తెలిసింది.
పంచాయితీలో మందలించడంతో దీంతో దివ్య జోలికి రానంటూ వెంకటేష్ హామీ పత్రం రాసిచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఆ తర్వాత దివ్యకు గజ్వేల్లోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు (ఏపీజీవీబీ)లో ఫీల్డ్ ఆఫీసర్గా ఉద్యోగం వచ్చింది. తల్లిదండ్రులు ఆమెకు వరంగల్కు చెందిన సందీప్ అనే యువకుడితో వివాహం కుదిర్చారు. ఈనెల 26న వారి పెళ్లి జరగాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో దివ్యకు బ్యాంక్ ఉద్యోగం రావడంతో పాటు, మరో వ్యక్తితో వివాహం నిశ్చయం కావడంతో కసి పెంచుకున్న వెంకటేష్ ఈ ఘోరానికి పాల్పడి వుంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వేములవాడలోని ఇంటికి తాళం వేసి వెంకటేష్తోపాటు అతని కుటుంబం ఎక్కడికో వెళ్లిపోయానట్లు తెలుస్తోంది. వెంకటేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.