37.2 C
Hyderabad
March 29, 2024 20: 09 PM
Slider ముఖ్యంశాలు

కిల్లింగ్ మిస్టరీ: దివ్య హత్య కేసులో కొత్త మలుపు

Divya Murder 19

గజ్వేల్‌లో దారుణ హత్యకు గురైన యువతి దివ్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్న వేములవాడకు చెందిన వెంకటేష్‌తో దివ్యకు మూడేళ్ల క్రితమే ప్రేమ వివాహం జరిగింది. ఇద్దరి కులాలు వేరు కావడంతో వెంకటేష్‌ తల్లిదండ్రులు ఈ పెళ్లిని అంగీకరించక లేదు.

దాంతో వారిద్దరూ వేరైపోయారు. పెళ్లి సమయంలో దివ్య మేజర్‌ కాకపోవడంతో ఆమెను తల్లిదండ్రులు హాస్టల్‌లో ఉంచి చదించారు. ఈ నేపథ్యంలో పలుమార్లు  దివ్యను వెంకటేష్‌ వేధించాడని, చివరకు ఈ వ్యవహారం పంచాయితీ వరకూ వెళ్లిందని తెలిసింది.

పంచాయితీలో మందలించడంతో  దీంతో దివ్య జోలికి రానంటూ వెంకటేష్‌ హామీ పత్రం రాసిచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఆ తర్వాత దివ్యకు గజ్వేల్‌లోని ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకు (ఏపీజీవీబీ)లో ఫీల్డ్‌ ఆఫీసర్‌గా ఉద్యోగం వచ్చింది. తల్లిదండ్రులు ఆమెకు వరంగల్‌కు చెందిన సందీప్‌ అనే యువకుడితో వివాహం కుదిర్చారు. ఈనెల 26న వారి పెళ్లి జరగాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో దివ్యకు బ్యాంక్‌ ఉద్యోగం రావడంతో పాటు, మరో వ్యక్తితో వివాహం నిశ్చయం కావడంతో కసి పెంచుకున్న వెంకటేష్ ఈ ఘోరానికి పాల్పడి వుంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వేములవాడలోని ఇంటికి తాళం వేసి వెంకటేష్‌తోపాటు అతని కుటుంబం ఎక్కడికో వెళ్లిపోయానట్లు తెలుస్తోంది. వెంకటేష్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Related posts

రాయలసీమకు నీరిచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదు

Satyam NEWS

క్యాస్ట్ పాలిటిక్స్: పాతది నాశనం కొత్తదానికి శ్రీకారం

Satyam NEWS

సేవా కార్యక్రమంలో ట్రాఫిక్, ఆర్మర్డ్ పోలీసులు..!

Satyam NEWS

Leave a Comment