అనురాగ్ హెల్పింగ్ సొసైటి ప్రెసిడెంట్, మాజి సిడబ్ల్యుసి చైర్ పర్సన్ డా|| కె.అనితారెడ్డి హన్మకొండలోని మల్లికాంబ మనో వికాసం కేంద్రం పిల్లలతో దీపావళి టపాసులు కాల్పించి దీపావళి వేడుకలను ప్రారంభించారు. పిల్లలకు దీపావళి టపాసులు అందించడమే కాక వారితో సంబురాలు జరిపించారు.
ఈ సందర్భంగా డా|| కె.అనితారెడ్డి మాట్లాడుతూ పండుగ అంటేనే మనం సంతోషంగా ఉండడం కాదని పది మందిని సంతోషపెట్టడం అని అన్నారు. మానసిక దివ్యాంగులు, బధిరుల పిల్లలతో ఈ వేడుక జరుపుకోవడం సంతోషంగా ఉందని ఈ రెండు రోజులు పిల్లల సంతోషం టపాసులు కాల్చుకోవాలని ముందుగానే వీరికి టపాకాయలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
దివ్యాంగుల సేవ విశ్వమానవ సేవ అని ప్రతి ఒక్కరు తమకు తోచిన మేర వీరికి సహాయసహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాము, కళ్యాన్, రామలీల, సిబ్బంది, పిల్లలు పాల్గొన్నారు. ముందే వచ్చిన దీపావళి అనిపించింది పిల్లల సంతోషం చూసి.