27.7 C
Hyderabad
April 18, 2024 08: 53 AM
Slider జాతీయం

సైనికులతో దీపావళి వేడుకలు

#modi

ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైనికులతో దీపావళి వేడుకలు చేసుకుంటున్నారు. ఇందుకోసం ప్రధాని కార్గిల్‌ చేరుకున్నారు. కార్గిల్‌ సైనికులతో కలిసి మోదీ పండగ సంబరాల్లో పాల్గొంటారని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. 2014లో మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి దీపావళి వేడుకలను సైనికులతో కలిసి చేసుకున్నారు. అప్పటి నుంచి ఏటా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న జవాన్లతో కలిసి పండగ సంబరాల్లో పాల్గొంటున్నారు. గతేడాది జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా నౌషేరా సెక్టార్‌లో సైనికులతో కలిసి మోదీ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సారి కార్గిల్‌లో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు.

Related posts

పీయస్ఆర్ యువసేన ఆధ్వర్యంలో భోజనం ప్యాకెట్ల పంపిణీ

Satyam NEWS

సేవలోనే ఆరోగ్యం.. ఆనందం అంటున్న డాక్టర్ కమ్ డైరెక్టర్

Satyam NEWS

బాసరలో ఆఖరి శ్రావణ శుక్రవారం పూజలు

Satyam NEWS

Leave a Comment