35.2 C
Hyderabad
April 24, 2024 13: 18 PM
Slider జాతీయం ముఖ్యంశాలు

ఢిల్లీని చుట్టేసిన దీపావళి టపాసుల కాలుష్యం

delhi-pollution-1

దీపావళి పండుగ పుణ్యమా అని దేశ రాజధానిలో పర్యావరణ కాలుష్యం తారాస్థాయికి చేరింది. పండగ వేడుకల అనంతరం ఢిల్లీ నగరాన్ని కాలుష్యం మరింత కమ్మేసింది. ‘సిస్టం ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్ కాస్టింగ్ అండ్ రీసెర్చ్(సఫర్)’ నివేదిక ప్రకారం దేశ రాజధానిలో సోమవారానికి పవన నాణ్యత సూచీ ఉదయం 9 గంటలకు 463గా ఉండటంతో కాలుష్యం ప్రమాద స్థాయికి చేరుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ ఒకటిగా ఉన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఢిల్లీ కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా సుప్రీంకోర్టు 2018లోనే వాతావరణానికి హాని కలిగించే టపాసులను కాల్చరాదని, కేవలం ఎకో ఫ్రెండ్లీ టపాసులను మాత్రమే కాల్చాలని ఆదేశించింది. ఈ సారి నిర్ణీత వేళల్లోనే టపాసులు కాల్చి ఢిల్లీ పౌరులు సహకరించినా కూడా కాలుష్యం మాత్రం పెరుగుతూనే ఉంది.

Related posts

పేట మునిసిపాలిటీకి రామచంద్రారెడ్డి

Satyam NEWS

తిరిగి ప్రారంభం కానున్న శ్రీశైల మల్లికార్జునుడి దర్శనం

Satyam NEWS

పేద కుటుంబాలకు అన్ని వేళలా అండగా జనచైతన్య ట్రస్ట్

Bhavani

Leave a Comment