31.7 C
Hyderabad
April 24, 2024 23: 37 PM
Slider కరీంనగర్

దుబ్బాకలో టీఆర్ఎస్ ఓటమి ఖాయం

#DKAruna

పోలీసుల చర్యలకు నిరసనగా దీక్ష చేపట్టిన తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను బిజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ నేడు పరామర్శించారు.

తెలంగాణ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై దాడి హేయమైన చర్య అని అరుణ అన్నారు.

అధికార దాహంతో బీజేపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారని ఇది మంచిది కాదని ఆమె అన్నారు. క్షేత్ర స్థాయిలో బీజేపీ గెలుపు ఖాయం అయిన నేపథ్యంలో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని అరుణ అన్నారు.

టిఆర్ఎస్ కు ఓటు వేయకుంటే సంక్షేమ పథకాలు రావని బెదిరింపులకు గురి చేస్తున్నారని, ఓటమి భయంతోనే ఇలాంటి అలజడులు రేపుతున్నారని ఆమె అన్నారు.

దుబ్బాకలో టిఆర్ఎస్ పార్టీని ఓడించాలని ప్రజలు నిర్ణయించుకున్నారని, అల్లుడిని ముందు పెట్టి కేసీఆర్ వెనుకుండి నడిపిస్తున్నారని ఆమె అన్నారు.

కేంద్రం మీద పడి ఏడవడం తప్ప ఆర్ధిక మంత్రి హరీష్ రావు రాష్ట్రానికి ఏం చేశారో ప్రజలకు చెప్పాలని డికె అరుణ డిమాండ్ చేశారు.

కేంద్రం ఇచ్చిన నిధులతోనే రాష్ట్రంలో ప్రతి సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని అరుణ స్పష్టం చేశారు.

Related posts

గండి రామన్న దత్త సాయి మందిరం లో ధుని ప్రారంభించిన మంత్రి

Satyam NEWS

శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి: సర్వ లోకాల సృష్టికర్త విశ్వకర్మ

Satyam NEWS

క్రైస్తవ అభ్యర్ధుల నుంచి దరఖాస్తులకు ఆహ్వానం

Satyam NEWS

Leave a Comment