మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ ఏఎస్రావునగర్ డివిజన్ లోని భవాని నగర్ సక్షేమసంఘం కమ్యూనిటీ హాల్ లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని జిల్లా వైద్య అధికారి డాక్టర్ మల్లికార్జున్ సందర్శించారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ మాల్లాడుతూ కాలనీ లలో కప్లీట్ వ్యాక్సినేషన్ బాగంగా ఇంటింటికి సర్వే వెరిఫికేషన్ చేయాలని, వ్యాక్సినేషన్ వేయించుకోని వారిని వ్యాక్సిన్ వేయించుకునే విదంగా మోటివేటివ్ చేయాలని మున్సిఫల్ అధికారలకు సూచించారు. వ్యాక్సిన్ కప్లీట్ అయిన ఇంటికి గుర్తుగా స్టిక్కరింగ్ వేయాలని మున్సిఫల్ అధికాలకు సలహాలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డాక్టర్ జీవనజ్యోతి, తెదేపా సీనియర్ నాయకులు నీరుకొండ సతీష్బాబు, బిజేఆర్కాలని అధ్యక్షుడు ఎస్.ఎ.రహీమ్,అంజలి, రాజు, వ్యాక్సినేషన్ సిబ్బంది మరియు మున్సిఫల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.