పండుగల సీజన్ వచ్చేసింది.. ఈ సందడి సంక్రాంతి వరకు సాగుతోందని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. ఈ పండుగల నేపథ్యంలో వస్తువులు కొనేవారు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. ముఖ్యంగా ఫోన్ చేసి ఉచిత బహుమతులు ఇస్తామంటే అనుమానించాలని, బ్యాంకు వివరాలు, పాస్వర్డ్ చెప్పరాదని తెలిపారు. బ్యాంకు వివరాలు, పాస్వర్డ్ చెపితే సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయే అవకాశం ఉందని సీపీ మహేష్ భగవత్ తెలిపారు. మోసపోతే ఆలస్యం చేయకుండా 1930 నంబర్ కు కాల్ చేయాలని హితవు పలికారు. ఫేక్ కాల్స్ పట్ల బీ కేర్ ఫుల్ అని సీపీ వెల్లడించారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి