ఆవుల పేరు, మతము పేరు చెప్పుకుని పుట గడుపుకొనే ఎమ్మెల్యే రాజా సింగ్ ఒక గల్లీ లీడర్ అని తెలంగాణ మత్స్యకార కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ విమర్శించారు.
అలాంటి గల్లీ లీడర్ ప్రపంచం గుర్తించిన నాయకుడు రాహుల్ గాంధీని విమర్శించడం సబబు కాదని ఆయన అన్నారు. ‘‘నువ్వెంత నీ స్థాయి ఎంత… గోశామహల్ నియోజకవర్గంలో భవనాలు కడితే కమిషన్ అడిగి బతికే నువ్వు రాహుల్ గాంధీ ని విమర్శించడం ..ఆకాశం వైపు ఉమ్మి వేయడమే’’ నని ఆయన తీవ్రంగా విమర్శించారు.
బీజేపీ కార్యక్రమంలోకి రానియకపోవటంతోనే ఆయన విలువ అర్ధం అయిందని, పోయిన పరువు పెంచు కోవడానికి రాహుల్ గాంధీ పై విమర్శలు చేస్తే ఎలా అని ఆయన ప్రశ్నాంచు. ఇప్పటికైనా ఆయన స్థాయికి తగ్గట్టు మాట్లాడకపోతే బుద్ధి చెబుతామని మెట్టు సాయికుమార్ అన్నారు.