39.2 C
Hyderabad
March 28, 2024 16: 00 PM
Slider నల్గొండ

రోడ్డు ప్రక్కన చిరు వ్యాపారులపై అక్రమ చలాన్ల వసూలు నిలిపివేయాలి

#intuc

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఇందిరా భవన్ లో రెడిమెడ్,ఫ్యాన్సి చిరు వ్యాపారుల సంఘం యూనియన్ అధ్యక్షుడు షేక్ జాన్ సైదా అద్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఐ ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్ మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో పేదల జీవితాలు మరింత దుర్బర స్థితికి దిగజారాయని,కరోనా సమయంలో  పేదలకు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు.

ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పేద చిరు వ్యాపారులపై పోలీసులు ట్రాఫిక్ నిబంధనల పేరుతో చలాన్లు విధించటం బాధాకరమని,ఇటువంటి చర్యలు ప్రభుత్వ అధికారులు మానుకోవాలని కోరారు.పేద చిరు వ్యాపారులు అందరికీ ముద్రా లోన్లు ఇవ్వాలని యరగాని నాగన్న గౌడ్ డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్ రావు, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ కుమార్, కోతి సంపత్ రెడ్డి, జక్కుల మల్లయ్య,ముశం సత్యనారాయణ,ఐ ఎన్ టి యు సి నాయకుడు మేళ్ళచెరువు ముక్కంటి,చింతకాయల రాము, పోతనబోయిన రామ్మూర్తి,షేక్ ఇబ్రహీం,మహావీర్,సంజీవ్,ముఖేష్,గౌస్ జానీ,అజయ్ కుమార్,సోంద్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్  హుజూర్ నగర్

Related posts

హైదరాబాద్ లో 37వ హునార్ హాట్ ప్రారంభం

Satyam NEWS

Gross Negligence: రోడ్డెక్కిన వసతి గృహ విద్యార్థులు

Satyam NEWS

ధర్డ్ పార్టీ ఏజెంట్ల ద్వారా సెక్యూరిటీ గార్డ్స్ నియమించవద్దు

Murali Krishna

Leave a Comment