తిరుమల శ్రీవారి శేషాచలం కొండను ఆనుకొని జూపార్క్ సైన్స్ సెంటర్ ల మధ్యలో ఏడు,ఐదు నక్షత్రాల హోటల్ ల నిర్మాణం చేపడితే పవిత్రతతో పాటు ముఖ్యంగా భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా ఉగ్రవాదుల దాడులు జరిగినప్పుడు కేంద్ర నిఘా సంస్థలు తిరుమల శ్రీవారి శేషాచలం కొండలను బాంబు స్క్వాడ్,డాగ్ స్క్వాడ్, పోలీస్ బలగాలతో కూంబింగ్ చేపట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై గతంలో తిరుమల వెళ్లే ఘాట్ రోడ్ లో బాంబు బ్లాస్ట్ కూడా జరిగిందని, ఈ సంఘటనలను దృష్టిలో పెట్టుకుని నిత్యం వెళ్లే విఐపి ల, సామాన్య భక్తుల భద్రత దృశ్య జూ పార్క్ రోడ్ లో హోటల్ ల నిర్మాణాలకి స్వస్తి పలకాలని ఆయన సూచించారు. శేషాచలం కొండకు ఆనుకొని స్టార్ హోటల్ అనుమతులు ఇస్తే అందులో మద్యం, బార్ డీజే లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారని, దీని వల్ల పరిసరాల పవిత్రత దెబ్బతింటుందని నవీన్ కుమార్ రెడ్డి అన్నారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదని అందరికీ తిరుమలలో వసతి ఏర్పాటు చేయడం కొన్ని సందర్భాలలో కష్టతరం అవుతున్నదని చెబుతున్న టీటీడీ రాబోవు రోజులలో అలిపిరి జూపార్క్ మార్గంలో యాత్రికుల సౌకర్యార్థం వసతి సముదాయ నిర్మాణాల కోసం టీటీడీ కాళీ స్థలాలను (RESERVE) భద్రపరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు.