28.7 C
Hyderabad
April 20, 2024 03: 26 AM
Slider కృష్ణ

సాక్షి భావనారాయణ స్వామి భూములు ఇవ్వద్దు

#VijayawadaMunicipality

దేవాదాయ శాఖకు చెందిన శ్రీ సాక్షి భావనారాయణ స్వామి వారి ఆలయం భూమిని ఆటోనగర్ ఏర్పాటు కోసం అద్దెకు ఇచ్చే ప్రతిపాదనను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది.

ఈ మేరకు భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు మొగలిపువ్వు సాంబశివరావు, యువ మోర్చా పట్టణ అధ్యక్షుడు చిలకపాటి లక్ష్మణ్ రామాచార్యులు,  కలపాల శ్రీనివాసరావు,  వడ్రాణం ఉదయ్ రామ్, చుండూరు  సాయికిరణ్ తదితరులు ఒక ప్రకటన విడుదల చేశారు.

దాతలు స్వామి వారి ఆలయ అభివృద్ధి, స్వామివారి నిత్య  కైంకర్యం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం దానం ఇచ్చారని వారన్నారు. ఈ వ్యవసాయ భూములను నమ్ముకొని తరతరాలుగా రైతులు, రైతు కుటుంబాలు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారని వారన్నారు.

ఈ పంట భూములను వ్యవసాయేతర కార్యకలాపాలకు ఉపయోగించడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని వారు తెలిపారు.

ఆటో నగర్ కు వ్యతిరేకం కాదని, కానీ దేవాదాయ శాఖ భూములు ఇచ్చేందుకు మాత్రమే తాము వ్యతిరేకమని వార్నారు. దేవాదాయ యేతర భూముల లో ఆటోనగర్ ఏర్పాటుకు భారతీయ జనతా పార్టీ కి అంగీకరిస్తుందని వారు తెలిపారు.

Related posts

రిమంబరింగ్: నేనూ నా డ్రైవింగ్ లైసెన్సు

Satyam NEWS

ఈ మాటలు మోడీనీ కేసీఆర్ ను కదిలిస్తాయా?

Satyam NEWS

కామారెడ్డి విద్యార్థినికి గవర్నర్ ప్రశంస

Satyam NEWS

Leave a Comment