యువత స్వయం ఉపాధి అవకాశాల వైపు అడుగులు వేయాలని, క్రీడల పట్ల నైపుణ్యం పెంపొందించుకోవాలని నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి అన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని NSP క్యాంప్ ఆవరణలో ‘ఫ్రెండ్స్ యూత్’ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలను ప్రారంభించిన అనంతరం సైదిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న అన్ని సిమెంట్ పరిశ్రమలలో 70 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని , ఆయా సంస్థలలో ఉన్న ఖాళీల వివరాలు సమర్పించాలని కోరటం జరిగిందని అన్నారు.
యువత తమకు వచ్చిన అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, కేవలం ఉద్యోగమే కాకుండా స్వయంగా ఉపాధి అవకాశాల దిశగా అడుగులు వేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చనా రవి, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, ఎంపీపీ గుడెపు శ్రీనివాస్, జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అమరనాధ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ అమర్, మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ , హరిబాబు తదితరులు పాల్గొన్నారు.