ఇప్పటి వరకు ప్రశాంత్ ది కేవలం మిస్సింగ్ కేస్ గా మాత్రమే నమోదు చేసుకున్నామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. అయితే సోషల్ మీడియా, కొన్ని ప్రసార మాధ్యమాల్లో ప్రశాంత్ పై అసత్య ప్రచారాలను చేస్తున్నారని ఆయన అన్నారు. వాటిని ఎవరూ నమ్మొద్దు అని సజ్జనార్ తెలిపారు. ప్రశాంత్ వ్యవహారం పై తెలంగాణ పోలీసుల ఆరా.. ప్రశాంత్ వ్యవహారం లో వెలుగులోకి వస్తున్న సంచలన విషయాలు.. 10 నెలల క్రితమే ఇండియన్ రా ఏజెంట్ ప్రశాంత్ తండ్రి బాబురావు దగ్గరికి వచ్చినట్టు గుర్తింపు.. పది నెలల క్రితమే ప్రశాంత్ వివరాలు అడిగిన రా ఏజెంట్..ప్రశాంత్ పాకిస్థాన్ లో ఉన్నట్టు బాబురావు కి 10 నెలల క్రితమే సమాచారం ఇచ్చిన రా ఏజెంట్ వంటి సందేశాలు, వార్తలను నమ్మొద్దని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా అసత్య ప్రచారాలు చేసినా, షేర్ చేసినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
previous post