32.7 C
Hyderabad
March 29, 2024 12: 23 PM
Slider జాతీయం

కాంగ్రెస్, జేడీఎస్ కు ఓటేస్తే డ్రైనేజీలో వేసినట్లే..

#bandisainjai

కర్నాటకలో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు కలిసే పనిచేస్తున్నాయని, ఆ రెండు పార్టీలకు ఓట్లేస్తే డ్రైనేజీలో వేసినట్లేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను తగ్గించే ప్రమాదం ఉందన్నారు. ముస్లిం రిజర్వేషన్లను పెంచే కుట్ర జరుగుతోందన్నారు. కర్నాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా బండి సంజయ్ కుమార్ ఈరోజు గౌరిబిదనీరు, బాగేపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డి.పాళ్యలో ఓటర్ల వద్దకు వెళ్లి పువ్వు గుర్తుకు ఓటేయాలంటూ అభ్యర్థించారు.    

కర్నాటకలో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు కలిసే పనిచేస్తున్నాయి. ఆ రెండు పార్టీలకు ఓటేస్తే డ్రైనేజీలో వేసినట్లే. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే కర్నాటకలో ప్రజల బతుకులు ఆగమవుతాయి. కాంగ్రెస్ గెలిస్తే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను తగ్గించి ముస్లిం రిజర్వేషన్లు పెంచే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ దేశంలో అధికారంలో లేదు. నిధులెక్కడి నుండి తెస్తారు? కాంగ్రెస్ కు ఓటేస్తే డ్రైనేజీలో వేసినట్లేనని బండి సంజయ్ అన్నారు.

కర్నాటకలో బీజేపీకి మెజారిటీ సీట్లు రాబోతున్నయ్. మళ్లీ అదికారంలోకి రాబోతున్నం. కాంగ్రెస్, జేడీఎస్ ఎంత డబ్బు వెదజల్లినా బీజేపీ గెలుపును అడ్డుకోలేరన్నారు. కర్నాటకలో కాంగ్రెస్, ‌జేడీఎస్ పార్టీలు కలిసి గుంటనక్కల్లా పోటీ చేస్తున్నయ్…. బీజేపీ సింహం మాదిరిగా సింగిల్ గా పోటీ చేస్తుంది. మళ్లీ అధికారం తథ్యం అని స్పష్టం చేశారు.

Related posts

ఫస్ట్ టైం:మహిళా పోలీసుల కోసం మొబైల్ టాయిలెట్

Satyam NEWS

వకీల్ సాబ్ నిర్మాత దిల్ రాజుకు కరోనా పాజిటివ్

Satyam NEWS

ప్రభుత్వ రంగ సంస్థలను,ప్రజలను రక్షించుకుందాం

Satyam NEWS

Leave a Comment