సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ నియోజకవర్గం మట్టంపల్లి మండలంలో ఒక పేద కుటుంబానికి చెందిన విద్యార్ధి కష్టపడి చదివి కెమిస్ట్రీలో డాక్టరేట్ సాధించాడు. ఈ ఘనత సాధించిన రాజశేఖర్ ను హుజుర్ నగర్ శాసన సభ్యుడు శానంపూడి సైదిరెడ్డి కలసి సన్మానం చేసి అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చదువుకోవాలని, పల్లెల్లో అక్షరాస్యత శాతం పెంచాలని కోరారు. విద్యార్ధినీ,విద్యార్ధులు రాజశేఖర్ ను ఆదర్శంగా తీసుకోవాలని, కన్న తల్లిదండ్రులకు, పుట్టిన ఊరికు మంచి పేరు ప్రతిష్ఠలు తేవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మఠంపల్లి మండలపార్టీ అధ్యక్షుడు, సర్పంచ్ మన్నెం శ్రీనివాస్ రెడ్డి,Mpp పార్వతి కొండా నాయక్, Zptc జగన్ నాయక్, గ్రామ శాఖ అధ్యక్షుడు రామచంద్రయ్య, మరియు TRS పార్టీ నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.