కెమిస్ట్రీ విభాగంలోని పరిశోధక విద్యార్థినికి విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ను ప్రధానం చేసింది. “ఎ స్టడీ ఆన్ రిమూవల్ ఆఫ్ డైస్ ఫ్రమ్ అక్వియాన్ ఎన్విరాన్మెంట్ ” అనే అంశంపై ఆర్ . కరుణాదేవి ఒక పరిశోధనా గ్రంధం రచించింది. ఈ పరిశోధనా గ్రంధానికి డిపార్ట్ మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ అసిస్టెంట్ ప్రొపెసర్ డాక్టర్ వై . విజయ గైడెన్స్ ఇచ్చారు. రాచపూడి కరుణాదేవి పలు జాతీయ, అంతర్జాతీయ సెమినార్ లలో పరిశోధనా పత్రాలను సమర్పించారు. కరుణాదేవికి డాక్టరేట్ రావటం పట్ల వి . యస్ .యు కెమిస్ట్రీ విభాగం అధ్యాపకులు, పరిశోధనా విద్యార్థులు అభినందనలు తెలియచేశారు.
previous post