జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా హుజూర్ నగర్ మండల పరిధిలో covid 19 సందర్భంగా విస్తృత సేవలందించిన మండల వైద్యాధికారి డాక్టర్ లక్ష్మణ్ ని తెలంగాణ మెడికల్ & హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (H1) ఆధ్వర్యంలో నేడు ఘనంగా సన్మానం జరిగింది. ఈ సందర్భంగా లింగగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో మొక్కలు నాటారు.
ఈ సమావేశంలో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఇందిరాల రామకృష్ణ మాట్లాడుతూ ప్రాణాలు కాపాడే ప్రత్యక్ష దైవాలు వైద్యులని, కరోనా నుండి ఈ దేశాన్ని కాపాడిన ప్రతి వైద్యుడికి కృతజ్ఞతలు తెలుపుతూ డాక్టర్ లక్ష్మణ్ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో యూనియన్ మండల అధ్యక్ష్య, కార్యదర్శులు ఉదయగిరి శ్రీనివాస్, అలివేలు మంగ, జిల్లా నాయకులు గుర్రాల ఉపేందర్, పులి పుల్లమ్మ, విజయలక్ష్మి, జ్యోతి, స్వాతి, 102 సురేష్, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.