కడప జిల్లా రాజంపేటలోని లైయన్స్ క్లబ్ ఆఫ్ రాజంపేట వారి ఆధ్వర్యంలో బుధవారం డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్లకు సన్మానం చేశారు. రాజంపేట లైన్స్ క్లబ్ అధ్యక్షుడు నాసిర్ ఆధ్వర్యంలో రాజంపేటలోని డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ మధుసూదనకు ఘనంగా సన్మానం జరిగింది.
ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ డిస్టిక్ కోర్డినేటర్ పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా జూలై ఒకటవ తారీఖున డాక్టర్స్ డేగా నిర్వహిస్తున్నారని తెలిపారు. సమాజంలో డాక్టర్లు ప్రత్యక్ష దైవాలుగా భావిస్తారు, ముఖ్యంగా ఈ కరోనా సమయంలో వారి సేవలు ఎంతో విలువైనవని అన్నారు.
ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ కార్యదర్శి వెంకట సుబ్బయ్య నాయుడు, లయన్స్ క్లబ్ కోశాధికారి సంగరాజు సుబ్రమణ్యం రాజు లయన్స్ క్లబ్ రీజన్ చైర్మన్ మధ్య పట్ల రామకృష్ణనాయుడు సీనియర్ లైన్స్ లక్ష్మీనారాయణ షేక్అబ్దుల్లా రామచంద్రరాజు శంకర్ రాజు సుబ్రమణ్యం రాజు తదితరులు పాల్గొన్నారు.