సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎస్.వి. చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం డాక్టర్స్ డే సందర్భంగా పలువురు వైద్యులను ఘనంగా సన్మానించి సత్కరించారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ కోతి సాయిశరణి రెడ్డి,సభ్యులు మాట్లాడుతూ వైద్యులను సత్కరించుకోవడం పూర్వ జన్మ సుకృతం అని అన్నారు.ప్రపంచ స్థాయిలో గోప్ప వైద్యుడుగా పేరు గడించిన పశ్చిమ బెంగాల్ ద్వితీయ ముఖ్యమంత్రి డాక్టర్ బీదన్ చంద్ర రాయ్ జ్ఞాపకార్థం ‘ డాక్టర్స్ డే’ నిర్వహిస్తున్నందుకు గర్వంగా ఉందని, యావత్ ప్రపంచం వైద్యుల సేవలు చిరస్మరణీయం అన్నారు.
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కరోనా వైరస్ ప్రతికూల పరిస్థితుల్లో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవే పరమావధిగా భావించి కనిపించి కరోనా వైరస్ మొదటి,రెండవ దశలో ప్రజల ప్రాణాలు కాపాడిన యావత్ వైద్య బృందానికి శిరసు వంచి నమస్కరిస్తున్నామని, తల్లి,తండ్రి,వైద్యులే కంటికి కనిపించే దేవుళ్ళు అని అన్నారు.
ఈ సందర్భంగా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని మండల వైద్యాధికారి డాక్టర్ లక్ష్మణ్ గౌడ్,ప్రముఖ వైద్ నిపుణులు డాక్టర్ శివప్రసాద్,డాక్టర్ గంపల శిరీష కరుణ్ దంపతులు,డాక్టర్ రాకేష్ కుమార్ ను ఎస్.వి.చారిటబుల్ ట్రస్ట్ తరపున చైర్ పర్సన్ సాయిశరణి రెడ్డి, ట్రస్ట్ సభ్యులు ముస్తఫా,కాల్వ సాయి, గణేష్ సైదా,షరీఫ్ తదితరులు వైద్యులను ఘనంగా సన్మానించి సత్కరించారు.