33.2 C
Hyderabad
April 26, 2024 00: 49 AM
Slider వరంగల్

కురుమ యువ చైతన్య సమితి ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య వర్ధంతి

#mulugu dist

ములుగు జిల్లా దేవరుప్పుల మండల కడవెండి గ్రామంలో 1928 లో జన్మించిన దొడ్డికొమురయ్య భూమి కోసం, భుక్తి కోసం, బానిస బంధాల నుంచి విముక్తి కోసం పోరాడారు. వెట్టి చాకిరి విముక్తి కోసం నడుం బిగించి తెలంగాణ సాయుధ పోరాటంలో వీరమరణం పొందిన తొలి అమరుడు దొడ్డి కొమురయ్య. నైజాం దేశ్‌ముఖ్‌ల కుట్రలతో చెందిన కొమురయ్య రక్తంతో తెలంగాణ తడిసింది. బాంచెన్ దొర కాల్మొక్తా అంటూ దొర పెత్తనంలో నలిగిన వాళ్ల ను గొడ్డళ్లు, కొడవళ్లు చెత బట్టి పోరాడే దిశగా నడిపించిన ధీరుడు దొడ్డి కొమురయ్య. ఆయన 75 వ వర్దంతి వేడుకలను ఈ రోజు ములుగు జిల్లా కురుమ యువ చైతన్య సమితి అధ్యక్షులు నరిగే రాజ్ కుమార్ కురుమ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ  ఆ మహనీయుడి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆయన స్ఫూర్తిని  కొనసాగించాలని కోరారు. అదే విధంగా ప్రభుత్వం ఇప్పటికైనా ఆయన త్యాగాన్ని గుర్తించి  ఆ మహనీయుడి చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని, ట్యాంక్ బండ్ పై ఆయన విగ్రహాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

Related posts

ఇళ్లను కాదు ఊళ్లనే కడుతున్నజ‌గ‌న్ ప్రభుత్వం

Satyam NEWS

సమష్టిగా గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం

Satyam NEWS

బెంగాల్ ప్రజలకు అక్క కాదు… మేనల్లుడికి అత్త మాత్రమే

Satyam NEWS

Leave a Comment