విశాఖ సాగర తీరంలో తీవ్రంగా గాయపడిన ఒక డాల్ఫిన్ మృతదేహం కనిపించింది. అరుదుగా కనిపించే ఇలాంటి సంఘటనలు ఈ ప్రాంతంలో చర్చనీయాంశం అయింది.
విశాఖలోని యారాడ సముద్ర తీరానికి గాయాలతో ఒక డాల్ఫిన్ మృతదేహం కొట్టుకువచ్చింది. డాల్ఫిన్ మృత దేహాన్ని పరిశీలించిన స్థానిక మత్సకారులు దాని శరీరం మీద గాయాలు ఉన్నట్లు గమనించారు.
డాల్ఫిన్ సమాచారాన్ని అధికారులకు అందజేశారు. విశాఖ తీరంలో తిరిగే భారీ షిప్ రెక్కలు తగిలి తరచూ ఇలాంటి భారీ జలజీవులు, డాల్ఫిన్స్ తరచూ మృత్యువాత పడుతున్నట్లు మత్స్యకారులు తెలిపారు.
మృతిచెందిన డాల్ఫిన్ పొడవు 6 అడుగులు ఉంటుంది. మానవుడి తన విలాస జీవితం కోసం వాడే ప్లాస్టిక్ భూతం కారణంగా కూడా సముద్ర జీవులు మరణిస్తున్నాయి.