సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండల పరిధిలోని మట్టపల్లి మహా క్షేత్ర ప్రాంగణంలో నిత్యం వేద ఘోషతో పరిఢవిల్లుతున్న శ్రీ లక్ష్మీనృసింహ వేద స్మార్త పాఠశాలకు భోజన సదుపాయాలు నిమిత్తం ఖమ్మం వాస్తవ్యులు సదాసశివ రాధే ప్రసాద్,ప్రముఖ న్యాయవాది పుల్లాభోట్ల శివసుబ్రహ్మణ్య శర్మ లు 50,116 రూపాయలను వేద పాఠశాల అధ్యాపకులు చీమలపాటి ఫణిశర్మ ఘనాపాటి కి బుధవారం అందజేశారు.
ఈ కార్యక్రమంలో వేద పండితులు రవిశర్మ,బాచిమంచి చంద్రశేఖర్,రంగరాజు వాసుదేవరావు,పులిజాల శంకర్రావు, శ్రీకాంత్,దివాకరుని శేషగిరిరావు,చంద్రమౌళి శ్రీ గణేష్ శర్మ, పాఠశాల కార్యదర్శి సూరి వేంకట సుబ్రహ్మణ్య లక్ష్మీనారాయణ శర్మ తదితరులు పాల్గొన్నారు. సత్యం న్యూస్, హుజూర్ నగర్