సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని మిల్లర్స్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో సి సి కెమెరాల నిర్వహణ ఫండ్ నిమిత్తం మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పోలిశెట్టి లక్ష్మీ నరసింహారావు స్థానిక సి ఐ రాఘవరావుకు మిల్లర్స్ అసోసియేషన్ కార్యవర్గం సభ్యులు 50 వేల రూపాయల చెక్కును అందజేశారు.
ఈ కార్యక్రమంలో మిల్లర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సింగిరి కొండ శ్రీను, కోశాధికారి కుక్కడపు కోటేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ ఈగ కోటేశ్వరరావు, గజ్జి ప్రభాకర్, కుక్కడపు రామమోహన్ రావు, గెల్లి అప్పారావు, కీతా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.