ఖమ్మం పోలీస్ శాఖ పర్యవేక్షణలో పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఆవరణలో నిర్వహిస్తున్న శ్రీ కృష్ణ ప్రసాద్ మెమోరియల్ స్కూల్ లో చదువుతున్న నిరుపేద విద్యార్థులను అదుకునేందుకు బత్తినేని చారిటబుల్ ట్రాస్ట్ ఆద్వర్యంలో వితరణగా లక్ష రూపాయల ఆర్ధిక సహాయాన్ని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ కి అందజేశారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ మాట్లాడుతూ విద్యార్థులు కంప్యూటర్ నెట్వర్కింగ్,అత్యాధునిక సాంకేతిక అంశాలపై దృష్టి సారిస్తూ.. తము ఎంచుకొని రంగంలో రాణించడానికి ముందుకు సాగుతున్న శ్రీ కృష్ణ ప్రసాద్ మెమోరియల్ స్కూల్ విద్యార్థులకు అవసరమైన పాఠ్యా పుస్తకాలు, కంప్యూటర్లు, సైన్స్ ఎస్క్పో వంటి పోటీలలో విద్యార్థులకు తోడ్పాటు,సహాయ సహకారం అందిస్తున్న ట్రాస్ట్ చైర్మెన్ బత్తనేని నాగప్రసాద్, బతినేని ప్రకాష్, ప్రణిత్ లను పోలీస్ కమిషనర్ అభినందించారు. కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ శేషగిరిరావు పాల్గొన్నారు.
previous post