రోజు రోజుకూ విస్తరిస్తున్న కరోనా ను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతు పలుకుతూ దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి రూ.25 లక్షల 55 వేలు విరాళం ఇచ్చారు. నేడు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్కు విరాళానికి సంబంధించిన చెక్కును ఆయన అందచేశారు.
కోవిడ్ –19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి ఈ విరాళాన్ని ఆయన ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తో బాటు బూచేపల్లి వెంకాయమ్మ, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు.