సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రం లోని ప్రముఖ వ్యాపారవేత్త, శ్రీ సత్యనారాయణ స్వామి ఫార్ బాయిల్డ్ రైస్ మిల్ యజమాని గజ్జి ప్రభాకర్, వారి కుమారులు శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్ నిధికి 1,11,111 రూపాయలను అందచేశారు.
శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు బొంత రామిరెడ్డి, దయానందం, డాక్టర్ రంగాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గజ్జి ప్రభాకర్ కుమారులు శ్రీధర్, వాసు,యాదా రవి తదితరులు కూడా పాల్గొన్నారు.