సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం బూరుగడ్డ గ్రామంలోని గురప్ప స్వామి గుడి సమీపంలోని నూతన శ్రీ కంఠ మహేశ్వర స్వామి వారి దేవాలయానికి గోపుర శిఖర కలశాన్ని హుజూర్ నగర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు,గ్రామ మాజీ సర్పంచ్ అరుణ్ కుమార్,రాధికా దేశముఖ్ దంపతులు ఆదివారం దేవస్థానం పాలక అధ్యక్ష్య,కార్యదర్శి,సభ్యులకు కలశాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో దేశ్ ముఖ్ కుటుంబ సభ్యులు,కాసాని గురవయ్య, బెల్లంకొండ మట్టపల్లి, యరాగని బిక్షం,గురవయ్య,నరసింహారావు,నాగరాజు, లక్ష్మీనారాయణ,వెంకటేశ్వర్లు,సైదులు తదితరులు పాల్గొన్నారు.
బి.చంద్రశేఖర్ సత్యం న్యూస్, హుజూర్ నగర్