హైదరాబాద్ లోని ఉప్పల్ నియోజకవర్గంలో నిర్మిస్తున్న నందీశ్వర ఆలయం కళ్యాణ మండపానికి దాతలు సహకరించాలని మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్ పన్నాల దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మల్లాపూర్ డివిజన్ పరిధిలోని నాగలక్ష్మి నగర్ కాలనీలోని నందీశ్వర ఆలయం కళ్యాణ మండపం నిర్మాణా స్లాబ్ పనులకు ఆదివారం కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆలయ కళ్యాణ మండపం నిర్మాణానికి దాతలు సహకరించాలని కోరారు, ప్రస్తుతం దాతల సహకారంతో దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. మండపం నిర్మాణం కోసం కే. కృష్ణ రూపాయలు 30 వేలు, రాంపల్లి శివ కుమార్ గౌడ్ వంద సిమెంట్ బస్తాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పురోహితులు పాండు రంగాచార్యులు, ఆలయ కమిటీ సభ్యులు శ్రీహరి గౌడ్ , పి జి సుదర్శన్, పిఆర్ నాగరాజ్, మల్లేష్, వాసుదేవ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి