చిన్నారి బాలుడు తాను గల్లాపెట్టె లో ప్రతిరోజు దాచుకున్న డబ్బులను జిల్లా లోని కరోనా వైరస్ బాధితుల సహాయార్థం విరాళంగా అందించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అన్నారు. కరోనా వైరస్ బాధితుల సహాయార్థం శివాజీ చౌక్ నిర్మల్ ప్రాంతానికి చెందిన శ్రీరామ టింబర్ డిపో యజమాని జద్వాణి రావుజి భాయ్ అండ్ బ్రదర్స్ రూ. లక్ష రూపాయలు అందచేశారు.
ముధోల్ నాయబ్ తాహసిల్దార్ నిర్మల్ ఏఎన్ రెడ్డి కాలనీకి చెందిన కే శ్రీకాంత్ తన కుమారుడు రుషిల్ పుట్టిన రోజును పురస్కరించుకొని రూ. 5 వేలు, నిర్మల్ పట్టణం కూరన్నపేట కు చెందిన చిన్నారి బాలుడు తలకొక్కుల హర్ష తాను ప్రతిరోజు గల్లాపెట్టె (కిడ్డీ బ్యాంక్) లో దాచుకున్న డబ్బులను కరోనా వైరస్ బాధితుల సహాయార్థం మంగళవారం కలెక్టర్ కు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా వైరస్ బాధితుల సహాయార్థం జిల్లా విపత్తుల నిర్వహణ అధారిటీ (కలెక్టర్) నిధికి దాతలు విరాళాలు అందించడం అభినందనీయమన్నారు.