35.2 C
Hyderabad
April 20, 2024 18: 47 PM
Slider ఖమ్మం

రైతులను ఇబ్బంది పెట్టొద్దు

#Puvvada Ajay Kumar

రైతులు పండించిన జొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలం చింతగుర్తి గ్రామం, ఖమ్మం కార్పొరేషన్ లోని అల్లిపురంలో ప్రభుత్వం మార్క్ ఫెడ్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన మోక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పువ్వాడ ప్రారంభించారు.

ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జొన్నలు క్వింటాలుకు రూ.1962 కు చెల్లించి రైతుల వద్ద నుండి కొంటున్నామన్నారు.

రైతులు పండించిన మొత్తం పంటను మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు. గ్రామాల వారీగా రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. గతంలో రైతులకు ఉచితంగా కరెంట్ కూడా ఇవ్వాలనే పరిస్థితి ఉండేదని, కానీ నేడు రైతులు పండించిన పంటలను నిల్వ చేసుకొలేనంత విస్తారంగా పంటలు పండుతున్నాయని అయన వివరించారు.

గతంలో పొలాల్లో మోటార్లు, ట్రాన్స్ ఫార్మర్ లు కాలిపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని గుర్తు చేశారు. ఆ విషాద ఛాయలను పూర్తిగా పారదొలి వ్యవసాయంలో తెలంగాణ ను దేశంలోనే అగ్రభాగాన నిలిపిన వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఅర్ అని అన్నారు.

ఇప్పటికే రైతు బందు పథకం ద్వారా రైతులకు ప్రతి ఎకరాకు ప్రతి ఏడాది రూ.10 వేలు ఇస్తున్నామని, ఈ పథకం ఐదు ఏళ్ళుగా అందిస్తూ విజయవంతంగా పూర్తి చేసుకుందని అన్నారు. పట్టాలు ఉన్న వారికి కూడా రైతు బందు ఇస్తున్నామని, నేడు తెలంగాణ వ్యవసాయ హబ్ గా నిలిచిందన్నారు.

పిండి బస్తాలకు కొదువలేదని, గతంలో మంచుకొండ సొసైటీ ముందు ఎరువుల కోసం క్యూ లైన్ లో గంటల తరబడి నిలబడి, పోలీస్ చేతిలో లాఠీ దెబ్బలు కూడా తిన్న ఘటనలు లేకపోలేదన్నారు. రైతులు పండించిన వడ్లు మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తా మని ముఖ్యమంత్రి కేసీఅర్ హామీ ఇచ్చారని, తడిచిన ధాన్యం కూడా కొంటామని స్పష్టం చేయడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారని అన్నారు.

ఇటీవలే కురిసిన అకాల వర్షాల కారణంగా మొక్కజొన్న పంట నష్టపోయిన వారిని ఆదుకునేందుకు ఖమ్మం జిల్లా బోనకల్ మండలంకు ముఖ్యమంత్రి కేసీఅర్, ఉన్నతాదికారులు వచ్చి ఏకరానికి రూ.10వేలు నష్ట పరిహారం ప్రకటించిన విషయం గుర్తు చేశారు.

Related posts

హరితహారం కార్యక్రమం విజయవంతం చేయాలి

Satyam NEWS

లాక్ డౌన్ ను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు

Satyam NEWS

ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

Satyam NEWS

Leave a Comment