మతవాద పార్టీ లను గ్రామాల్లోకి రానివ్వొద్దని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్ పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం చిరుమర్రి గ్రామంలో భద్రయ్య అధ్యక్షతన జరిగిన జనరల్ బాడీ సమావేశంలో మనోహర్ మాట్లాడుతూ రాజ్యాంగం, రిజర్వేషన్లు రద్దు చేయాలని చూస్తున్న బీజేపీ లాంటి మనువాద పార్టీలని ప్రశాంతంగా ఉన్న గ్రామాలకు రానివ్వొద్దని పిలుపునిచ్చారు. దళితులను, మైనార్టీలను పొట్టన పెట్టుకుంటున్న మనువాద తిరోగమన పార్టీలని ఎప్పటికీ దరిదాపుల్లోకి రానియ్యకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం రైతు సంఘం జిల్లా నాయకులు బండి రమేష్ మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న పల్లెల్లోకి మత చిచ్చును లేపేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న మతోన్మాద పార్టీ లను, వారి విధానాలను తీవ్రంగా తిప్పికొట్టాలని స్పష్టంచేశారు. ప్రజాస్వామ్యాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తున్న ఉన్మాద కరమైన వారిని దరిదాపుల్లోకి రానివ్వొద్దని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ మండల కార్యదర్శి పంది నాగరాజు, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి వేల్పుల భద్రయ్య, గ్రామ నాయకులు గురవయ్య, ఇనుకొండ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు..
previous post
next post