ములుగు జిల్లా లోని రైతు వేదిక ను, డబుల్ బెడ్ రూమ్ లను ములుగు ఎంపీపీ గండ్ర కోట శ్రీదేవి సుధీర్ నేడు పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మాణ లోపాలు లేకుండా చేయాలని ఆమె కోరారు.
అదే విధంగా రైతుల కోసం నిర్మిస్తున్న వేదికలను త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో లో ములుగు జెడ్పీటీసీ సకినల భవాని, జెడ్పీ కో ఆప్షన్ మెంబెర్ రియాజ్ మీర్జా, మైనారిటీ మండల అధ్యక్షులు ఎండీ రజహూస్సెన్ తదితరులు పాల్గొన్నారు.