ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలం చిమ్మాపూడి గ్రామంలో రూ.1.51 కోట్లతో నిర్మించనున్న30-డబూల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పనులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం పల్లె ప్రకృతి వనం, కంపోస్టు షెడ్, రైతు కల్లాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాన్నిప్రారంభించారు. పాపాటపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు వేదికను ప్రారంభించారు.
ఆయా కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ ఆర్ వి. కర్ణన్, అదనపు కలెక్టర్లు స్నేహాలత, మధుసూదన్, జిల్లా వ్యవసాయ అధికారి విజయ నిర్మల, జిల్లా పౌరసరఫరాల అధికారి రాజేందర్, జిల్లా రెవిన్యూ అధికారి శిరీష, ఏఎంసీ చైర్మన్ వెంకటరమణ, సర్పంచులు, ప్రజాప్రతినిధులు తదితరులున్నారు.