కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా జుక్కల్ శాసన సభ్యులు హనుమంత్ సిండే బిచ్కుందలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ పాత్ర ఎంతో గొప్పదని ఆయన సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఎంపిపి అశోక్ పటేల్, మాజీ జడ్పిటిసి సాయిరాం, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు రాజు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బసవరాజ్ పటేల్, ఎంపిటిసిల ఫోరం అధ్యక్షులు సిద్దిరాములు, నూకల రాజు, రామ్ చందర్, మండల ప్రజాప్రతినిధులు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.