బాబా సాహెబ్ అంబేద్కర్ 129వ జయంతిని ఎవరి ఇంట్లో వారు జరుపుకోవాలని మాదిగ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా ఇంచార్జ్ బోరెళ్లి సురేష్ కోరారు. కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్త లాక్ డౌన్ ను గౌరవించి ఇంట్లోనే కుటుంబ సభ్యులతో బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతిని జరుపుకోవాలని మాదిగ జేఏసి వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి ఆదేశాల మేరకు ఈ పిలుపునిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉదయం 11 గంటలకు బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించాలని కోరారు.
previous post