హబ్సిగూడ డివిజన్ లోని రాంరెడ్డి నగర్, వాసవినగర్, వెంకట్ రెడ్డి నగర్ చుట్టుపక్కల కాలనీలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం కోరకు కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరిష్ అధికారులతో కలిసి పర్యటించారు. మూసికి దగ్గర ఉన్న కాలనీల్లో మురుగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉందని దీనికి తగిన శాశ్వత పరిష్కారం కోరకు ట్రంకులైను తదితర అంశాలపై అధికారులతో కలిసి చర్చించారు. ఈ సందర్భంగా అధికారులు త్వరలోనే శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్ టి పి ,జి యమ్ సుబ్రమణ్యం ,జలమండలి జియమ్ జాన్ షరీప్, డిజియమ్ రజనీకాంత్, ఎఈ. కీర్తీ శ్రీ, డిఈ. నాగమణి, బిజెపి డివిజన్ ఓబిసి ప్రధాన కార్యదర్శి ముశిగంపల శివ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి