హైదరాబాద్ అంబర్ పేట డివిజన్ బాపునగర్ లో మ్యాన్ హోల్ పాడైపోయి డ్రైనేజ్ వాటర్ లీక్ అవుతుండడంతో స్థానికులు జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులు అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో కలిసి అక్కడికి వెళ్లి సమస్యను పరిశీలించి నూతన మాన్ హోల్ ఏర్పాటు చేయిస్తానని స్థానికులకు హామీ ఇచ్చారు. కార్పొరేటర్ అధికారులతో మాట్లాడుతూ వెంటనే నూతన మ్యాన్ హోల్ ఏర్పాటు చేయాలని స్థానికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఏఈ కుషాల్,వర్క్ ఇన్స్పెక్టర్ దుర్గ, స్థానిక బస్తీ ప్రజలు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దయాకర్ యాదవ్, సంతోష్ చారి తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట