నాలా వ్యూహాత్మక అభివృద్ధి లో భాగంగా శుక్రవారం అంబర్ పేటలోని పలు నాలలను సంబంధిత జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సందర్శించారు. జీహెచ్ఎంసీ ఈఎన్సీ జియావుద్దీన్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఈఈ శంకర్, డీఈ సుధాకర్, ఎఈలు ఫరీద్, ప్రేరణ లతో కలిసి మొదట గోల్నాక డివిజన్ కృష్ణానగర్ నాలా, గోల్నాక లంక నాలా, బాగ్ అంబర్పేట బతుకమ్మ కుంట నాలా లను పరిశీలించారు. నాలల్లో పేరుకుపోయిన చెత్త, వ్యర్థాలను వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. వానా కాలంలో ముంపు సమస్య తలెత్తకుండా చూడాలని తెలిపారు. గత ఏడాది మాదిరిగా ముంపు లేకుండా గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు.
సత్యం న్యూస్, అంబర్పేట